Tuesday, April 23, 2024

ఆర్డీటీ 10కె రన్.. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

అనంతపురం: అనంతపురంలో ఆర్డీటీ సంస్థ వారు నిర్వహించిన 10కె రన్ ను ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, మహిళా సాధికారత విభాగం డైరెక్టర్ విశాల ఫెర్రర్ తో కలసి జిల్లా ఎస్పీ పకీరప్ప ప్రారంభించారు. ఉత్సాహ భరిత వాతావరణంలో 10కే రన్ సాగింది. ఈ పరుగులో స్పానిష్ కు సంబంధించిన యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువత క్రీడల పట్ల మరింత అవగాహనను పెంపొందించుకొని దేశానికి మంచి క్రీడాకారులుగా సేవలు అందించాలని కోరారు. దీంతోపాటు యువతీ యువకులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే దేశం సైతం ఆర్థిక ప్రగతిలో ముందుకు సాగుతుందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement