Wednesday, March 27, 2024

పాత నేరస్తుల ఇళ్లలో పోలీసుల తనిఖీలు

అనంతపురం క్రైమ్ – జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో పలు సమస్యాత్మక ప్రాంతాలలో అనుమానితులను పాత నేరస్తుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు శనివారం నాడు జిల్లా ఎస్పీ సత్య ఏసు బాబు ఆదేశాల మేరకు నగర డిఎస్పీ వీర రాఘవ రెడ్డి పర్యవేక్షణలో నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సి ఏ కత్తి శ్రీనివాసులు ఎస్ఐ సిబ్బంది. స్టేషన్ పరిధిలోని సమస్యాత్మకమైన ప్రాంతాలు రుద్రంపేట శివారు.చంద్రబాబు కొట్టాలు . విమల ఫారూక్ నగర్, సిబిఎన్ కాలనీ, పంతులకాలనీ, తదితర ప్రాంతాలలో పోలీసులు అనుమానితుల, పాత నేరస్తుల ఇళ్లల్లో కార్డెన్ సర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. అనంతరం ఆయా కాలనీల్లో గ్రామసభలు నిర్వహించి జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించారు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఉల్లంఘించలేదని నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement