Thursday, April 25, 2024

రేపు హిందూపురానికి ఎమ్మెల్యే బాలకృష్ణ..

అనంతపురం : ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారయ్యాయి అక్కడి రాజకీయాలు. ప్రతిపక్ష నాయకుల పాదయాత్రలకు, సభలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రేపు హిందూపురానికి ఎమ్మెల్యే బాలకృష్ణ రానున్నారు. ఇదేం కర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అయితే బాలకృష్ణ కార్యక్రమానికి అనుమతి కోసం టీడీపీ నేతలు పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అనుమతిపై ఇప్పటి వరకు పోలీసులు స్పందించలేదు. బాలకృష్ణ కార్యక్రమంపై ఉత్కంఠ కొనసాగుతుంది. పోలీసులు అనుమతి లేకుండా కార్యక్రమం కొనసాగిస్తారా? లేదా.. సాయంత్రం లోపు అనుమతులు జారీ చేస్తారా అన్నది వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement