ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రామగిరి మండలం పెనుబోలు గ్రామ జాతీయ రహదారిపై ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని కంటైనర్ లారీ ఢీ కొంది. దీంతో బొలెరోలో ఉన్న ఇద్దరు మృతిచెందగా, మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు కొలిమిగుండ్ల వాసులుగా గుర్తించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement