Friday, March 29, 2024

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

అనంతపురం జిల్లాలో రౌడీలకు కౌన్సిలింగ్ ఇచ్చే కార్యక్రమాకి ఎస్పీ పకీరప్ప శ్రీకారం చుట్టారు. అక్కడక్కడ రౌడీషీటర్ల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించి, జిల్లాలో సబ్ డివిజన్ల వారీగా పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. తమ నడవడిక ను మార్చుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని సీరియస్ గా హెచ్చరించారు. అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, గుంతకల్లు, పెనుకొండ, పుట్టపర్తి తదితర సబ్ డివిజన్లలో డీఎస్పీల నేతృత్వంలో కౌన్సిలింగ్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.నేరాల జోలికెళ్లకుండా బుద్ధిగా జీవించాలని సూచించారు. నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా చట్టపరంగా గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement