Friday, April 19, 2024

హిందూపురంలో క‌రోనాతో 15 మంది మృతి.. బాల‌కృష్ణ దిగ్ర్భాంతి..

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంట‌ల‌లో 15 మంది కరోనా రోగులు మరణించారు.. వారిలో 8 మందికి ఆక్సిజ‌న్ అంద‌క విగ‌త జీవుల‌య్యారు… దీనిపై ఆ నియోజ‌క‌వ‌ర్గం టిడిపి ఎమ్మెల్యే, హీరో బాల‌కృష్ణ దిగ్ర్బాంతి వ్య‌క్తం చేశారు.. కోవిడ్ ఆసుపత్రిలో ఒకే రోజు సుమారు 15 మంది చనిపోవడం బాధాకరమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement