Thursday, March 28, 2024

ఇద్దరు మహిళలపై హత్యాయత్నం

తాడిపత్రి టౌన్ : అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఆరుబయట నిద్రిస్తున్న ఇద్దరు మహిళలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన క‌ల‌క‌లం రేపింది. వివరాల్లోకి వెళ్తే ఇరువురు మహిళలు ఆదివారం రాత్రి ఆరుబయట నిద్రిస్తుండగా కొందరు యువకులు తెల్లవారుజామున దాదాపు రెండు గంటల సమయంలో పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పారిపోయారు. మహిళలు కేకలు వేయడంతో కుటుంబీకులు, చుట్టు పక్కల వారు వచ్చి మంటలు ఆర్పి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఈ విషయంపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement