Thursday, April 18, 2024

లెక్చరర్ పై హత్యాయత్నం.. పరిస్థితి విషమం..

లెక్చరర్ ను తన భర్తే గొంతుకోసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఆర్ట్స్ కళాశాల కామర్స్ లెక్చరర్ సుమంగళిపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కామర్స్ డిపార్ట్‌మెంట్ నుంచి బయటకు వస్తున్న సుమంగళిపై భర్త పారేష్ కత్తితో దాడి చేశాడు. మనస్పర్ధల కారణంగా భార్యాభర్తలు సుమంగళి, పారేష్ వేర్వేరుగా నివాసముంటున్నారు. భర్త పారేష్‌పై సుమంగళి గృహహింస కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సుమంగళిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పారేష్ ఆమెపై ఈ దాడికి పాల్పడ్డాడు. భర్త పారేష్ దాడిలో గాయపడిన సుమంగళిని తోటి లెక్చరర్లు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement