Wednesday, March 27, 2024

స్క్రాప్‌ దుకాణంలో భారీ పేలుడు.. ఒకరు మృతి

శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలోని ఇండస్ట్రియల్‌ ఏరియాలో స్క్రాప్‌ దుకాణంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడుకు భారీగా శబ్ధం రావడంతో ఇండస్ట్రియల్‌ ఏరియా పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement