Thursday, April 25, 2024

జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిపై కేసు న‌మోదు

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయ‌న అనుచ‌రుల‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి పట్టణంలో 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ… అనుమతి లేకుండా టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట చట్ట విరుద్ధంగా నిరసన తెలిపారంటూ ఆయనతో పాటు మరో 120 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. టీడీపీ కౌన్సిలర్లపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ తన అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నా చేపట్టారు. వైసీపీ ఆగడాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా ఆందోళనకు దిగి, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారంటూ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డితో పాటు ఆయ‌న అనుచ‌రుల‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement