Wednesday, April 24, 2024

పిచ్చి కుక్క దాడిలో.. 9మందికి గాయాలు

యల్లనూరు, మార్చి 21 (ప్రభ న్యూస్) : యల్లనూరు మండల కేంద్రంలో మంగళవారం పిచ్చికుక్క దాడిలో ముగ్గురు పాఠశాల విద్యార్థులు, ఒక వికలాంగుడు, 5మంది స్థానికులు గాయపడ్డారు. గాయపడిన వారికీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ముగ్గురి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల చొరవతో పిచ్చికుక్క ను వెంబడించి చంపివేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement