Thursday, April 18, 2024

ఆన్ లైన్ ద్వారా మందును సరఫరా చేయడం కుదరదు: ఆనందయ్య సన్నిహితుడు సంపత్ రాజు

కృష్ణపట్నం ఆనందయ్య సన్నిహితుడు సంపత్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం వైపు నుంచి తగిన  సహకారం లేదని ఆయన అన్నారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చేవారికి మందు ఇవ్వలేక ఆనందయ్య కంటతడి పెట్టుకుంటున్నారని చెప్పారు. కృష్ణపట్నంలో ప్రస్తుతం సెక్షన్ 144 అమలు చేస్తున్నారని తెలిపారు. మందు పంపిణీ జరగదని… దయచేసి ఎవరూ రావద్దని ప్రజలకు విన్నవించారు. ఆనందయ్య రోజుకు కేవలం 5 వేల మందికి సరిపడా మందును మాత్రమే తయారు చేయగలరని చెప్పారు. జిల్లాల వారీగా లక్షల మందికి మందును సరఫరా చేస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదని అన్నారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. ఆన్ లైన్ ద్వారా మందును సరఫరా చేయడం కుదిరేపని కాదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement