రాపూరు రూరల్ : (ప్రభ న్యూస్) నెల్లూరు జిల్లాలో యాక్సిడెంట్ జరిగింది. బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి వ్యక్తి మృతి చెందిన సంఘటన రాపూరు మండలంలోని సిద్దవరం సమీపంలో శనివారం ఉదయం జరిగింది. ఎస్సై కాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పొదలకూరు మండలం అయ్యగారిపాలెంకు చెందిన యకసిరి రమేష్ (40) పొదలకూరు నుంచి వెంకటగిరికి వెళ్తున్నాడు.
రాపూరు మండలంలోని సిద్దవరం సమీపంలో ఉన్న మలుపు వద్ద బైక్ డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో డివైడర్ అవతల వైపు రాళ్ళ మీద రమేశ్ పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఎస్సై, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.