Thursday, April 25, 2024

అంబేద్క‌ర్ విగ్ర‌హానికి నివాళుల‌ర్పించిన ఎమ్మెల్యే భూమ‌న ..

తిరుపతి సిటీ ప్రభ న్యూస్ : రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ప్రపంచానికే మార్గనిర్దేశకులని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఉద్ఘాటించారు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా స్థానిక బస్టాండ్ ఎదుట డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి భూమన నివాళ్ళుల‌ర్పించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో భూమన మాట్లాడారు. దేశంలో అనాగరికంగా వేలాది సంవత్సరాల కిందట ఏర్పడిన కుల, వర్ణ వ్యవస్థతో పాటు అనాగరిక సంప్రదాయాలు, ఆచారాలను… అంబేద్కర్ తన వజ్రాయుధం లాంటి ఆలోచనలతో ఒక్క పెట్టున అంతమొందించారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అణచివేతకు, దోపిడీకి, దౌర్జన్యాలకు గురవుతున్న వారందరి గొంతుకగా మారి, తిరుగుబాటు బావుటా ఎగురవేసిన చిరస్మరణీయులు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అని భూమన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ,. తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ తొండమా నాటి వెంకటేశ్వర్ రెడ్డి. . కార్పొరేటర్లు ఎస్. కె .బాబు. హనుమంతు నాయక్. కో ఆప్షన్ సభ్యులు రుద్ర రాజు శ్రీదేవి. పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement