Wednesday, April 24, 2024

మంత్రి వెల్లంపల్లికి నిరసన సెగ.. రాజీనామా చేయాలంటూ నినాదాలు

మంత్రి వెల్లంపల్లికి అమరావతి రైతుల నిరసన సెగ తగిలింది.  గురుపౌర్ణమి సందర్భంగా గుంటూరు జిల్లాలోని తాళ్లాయపాలెంలోని శివస్వామి ఆశ్రమానికి మంత్రి వెల్లంపల్లి వచ్చారు. అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని కుదించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్లంపల్లి మంత్రి అయ్యాక దేవాలయాలపై దాడులు పెరిగాయంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి రైతులు మంత్రిని కలిసి వినతి పత్రం అందించేందుకు యత్నించారు. అయితే, మంత్రిని కలిసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెల్లంపల్లి దేవాదాయ మంత్రి అయ్యాక ఆలయాలపై దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిస్టర్ డౌన్ డౌన్… వెల్లంపల్లి రాజీనామా చేయాలి అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం.. చేసి అమరావతి రైతులను చెదరగొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement