Friday, April 26, 2024

పార్టీ మారాలనే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు.. కొడాలి నాని

పార్టీ మారాలనే ఉద్దేశంతోనే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇలాంటి వాళ్లు పోతేనే దరిద్రం పోతుందన్నారు. మంత్రి పదవి రాలేదని పార్టీ మారాలనుకున్నారని తెలిపారు. సామాజిక సమీకరణల ప్రకారమే జగన్ అన్ని వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. 20మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడే జగన్ ను ఏమీ చేయలేకపోయారు… ఇప్పుడేం చేస్తారని అన్నారు. చంద్రబాబు సీఎం అయ్యే పరిస్థితి లేదని కొడాలి నాని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement