Tuesday, March 26, 2024

అన్ని పార్టీలు ఒక వైపు.. జగన్ ఒక్కరే ఒక వైపు.. మంత్రి పెద్దిరెడ్డి

అన్ని పార్టీలు ఒక వైపు ఉంటే.. సీఎం జగన్ ఒక్కరే ఒక వైపు ఉన్నారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్ పులివెందుల పులి అన్నారు. జగన్ ను ఎదిరించాలంటే చంద్రబాబుకు ధైర్యం చాలదన్నారు. అందుకే తోక పార్టీలను కలుపుకొని ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారన్నారు. ఎంత మంది కలిసి పోటీ చేసినా.. మళ్లీ సీఎం అయ్యేది జగనే అన్నారు. డెవలప్ మెంట్, సంక్షేమం రెండు కళ్లుగా జగన్ పాలన చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement