Tuesday, April 16, 2024

అడుగడుగు ఆశయ సాధనకే.. రాజధాని రైతుల మహాపాదయాత్ర పుస్తకం ఆవిష్కర‌ణ‌

అమరావతి రైతులు రాజధాని ప్రాంతం నుంచి తిరుపతి వరకు గత నవంబర్ 1నుంచి డిసెంబర్ 17 వరకు మహాపాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో పల్నాడు జిల్లా ఎడ్లపాడుకు చెందిన ఉద్యాన విశ్వవిద్యాలయం పాలకమండలి మాజీ సభ్యుడు పోపూరి శివరామకృష్ణ 47 రోజులపాటు పాల్గొన్నారు. ఆయన ప్రత్యక్షంగా పాదయాత్రలో పాల్గొన్న తన అనుభవాలను ‘అడుగడుగు.. ఆశయ సాధనకే’ పేరుతో 144 పేజీలతో పుస్తకాన్ని రచించారు.

దానిని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం రాత్రి టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు ఆవిష్కరించారు. పాదయాత్రను కళ్ల‌కు కట్టినట్లుగా రచించిన పోపూరి శివరామకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. కష్టనష్టాలకోర్చి పాదయాత్రలో పాల్గొని పుస్తకాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దడం గొప్ప విషయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement