కోరుకొండ : కోరుకొండ మండలం పశ్చిమగోనగూడెం ఎంపీటీసీ పదవికి మంగళవారం జరగనున్న పోలింగ్ కు సంబంధించి పోలింగ్ కేంద్రాన్ని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా శాంతి భద్రతల అడిషనల్ ఎస్పీ లతా మాధురి పరిశీలించారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సూచించారు. ఉత్తర మండల డిఎస్పి కడలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రం వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు 20 మంది పోలీస్ కానిస్టేబుల్ లు నియమించి బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా సీతానగరం మండలం కాటవరం ఎంపిటిసి పదవికి జరుగుతున్న పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అడిషనల్ ఎస్పీ వెంట ఉత్తర మండల డి.ఎస్.పి, కడలి వెంకటేశ్వరరావు కోరుకొండ సబ్ ఇన్స్పెక్టర్ శారదా సతీష్ ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement