Saturday, April 20, 2024

అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలి: సీఎం జగన్

ఏపీలో గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గంజాయ సాగు, రవాణాను అరికట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా దాడులు నిర్వహించాలని, పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మద్య నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామని తెలిపారు. మూడింట ఒక వంతు దుకాణాలను మూసివేశామన్న సీఎం.. బెల్టుషాపులను తీసేశామని చెప్పారు. పర్మిట్‌ రూమ్‌లను మూసివేయించామన్నారు. లిక్కర్‌ సేల్స్‌ నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు తగ్గాయని తెలిపారు. బీరు సేల్స్‌ నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయని చెప్పారు. ఇలాంటి సందర్భంలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని, మద్యం తయారీని అడ్డుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అక్రమ రవాణా, అక్రమంగా మద్యం తయారీపైన ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. మద్యం అక్రమ రవాణా, తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదివరకే చట్టాన్ని తీసుకు వచ్చామని, దీన్ని అమలు చేయాలని చెప్పారు.

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం తెలిపారు. ఏ కాలేజీలోనైనా అలాంటి ఉదంతాలు కనిపిస్తే.. అక్కడ ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. క్రమం తప్పకుండా విశ్వవిద్యాలయాలు, కాలేజీలపైన పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. కార్యాచరణ తయారుచేసి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలన్న సీఎం..ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో వచ్చే సమావేశంలో తెలియజేయాలన్న ఆదేశించారు. ఆరోగ్యానికి అత్యంత హానికరంగా మారిన గుట్కా విక్రయాలు, రవాణాపైన దృష్టిపెట్టాలన్నారు.

నిర్దేశించిన రేట్లకన్నా ఇసుకను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఈబీ కాల్‌సెంటర్‌ నంబర్‌పై బాగా ప్రచారం చేయాలని తెలిపారు. అధిక రేట్లకు ఎవరైనా అమ్మితే వెంటనే వినియోగదారులు ఆ నంబర్‌కు కాల్‌చేసేలా ప్రచారం చేయాలన్నారు. వచ్చే కాల్స్‌పై సత్వరమే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత జిల్లాల వారీగా ఈ ప్రచారం చేయాలన్నారు. ఆ జిల్లాల్లో రేట్ల వివరాలను తెలియజేస్తూ అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వాలన్నారు. అంతకన్నా ఎక్కువ ధరకు ఎవరైనా విక్రయిస్తే.. తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా అధికారులు దీనిపై పర్యవేక్షణ చేయాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే మరిన్ని రీచ్‌లు, డిపోల సంఖ్య పెంచేలా చూడాలని సీఎం జగన్ తెలిపారు.

ఇది కూడా చదవండి: 9999 నంబర్ ని రూ.17 లక్షలకు దక్కించుకున్న ఎన్టీఆర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement