Thursday, March 28, 2024

Bapatla: వాలంటీర్ ను హత్య చేసిన నిందితుడు ఆత్మహత్య

వాలంటీర్ ను దారుణంగా హత్య చేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఇటీవల వాలంటీర్‌ను దారుణంగా హత్య చేసిన నిందితుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 15న జిల్లా వేమూరు మండలం చావలిలో వాలంటీర్‌ శారదను పద్మారావు(35) అనే యువకుడు హత్య చేసి పారిపోయాడు. అయితే ఈరోజు నిందితుడు నిడుబ్రోలు రైలు స్టేషన్‌లో తిరుపతి -విశాఖ డబుల్‌ డెక్కర్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement