Saturday, April 20, 2024

చోరీ కేసులో నిందితుడు ప‌రార్‌.. జైలుకు తీసుకెళ్తుంటే పోలీసుల క‌న్నుగ‌ప్పి ఉడాయింపు

తిరుపతి సిటీ (ప్రభ న్యూస్) : చోరీ కేసులో ఓ నిందితుడిని సబ్ జైల్‌కు తీసుకెళ్తుండ‌గా పోలీసుల నుంచి త‌ప్పించుకున్న ఘ‌ట‌న శనివారం సాయంత్రం చిత్తూరు జిల్లాలో జ‌రిగింది. బెంగళూరుకు చెందిన నరసింహులు కుమారుడు మూర్తి నవీన్ అలియాస్ అశోక్ (28) నెల్లూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో దొంగతనాలు చేశాడు. 2017లో రైల్వే పోలీస్ స్టేషన్‌లో రెండు చోరీ కేసుల్లో ఉన్నాడు.

కాగా, నిన్న‌ మధ్యాహ్నం తిరుపతి తుడా క్వార్టర్స్‌లో దొంగతనానికి వెళ్లాడు. పోలీసులకు సమాచారం రావడంతో నవీన్ ని ప‌ట్టుకున్నారు. ఇవ్వాల (శ‌నివారం) నిందితుడిని ఎంఆర్ పల్లి పోలీసులు కోర్టుకు హాజరు ప‌రిచేందుకు తీసుకెళ్లారు. కోర్టుకు హాజరుపరిచి తిరిగి సబ్ జైల్ కి తీసుకెళ్తుండగా న‌వీన్ పోలీసుల ద‌గ్గ‌ర నుంచి ప‌రారైన‌ట్టు తెలుస్తోంది. అయితే కొవిడ్ టెస్ట్‌ల కోసం ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా అక్క‌డి నుంచి త‌ప్పించుకున్నాడ‌ని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement