Saturday, April 20, 2024

Followup | తిరుపతి జిల్లాలో యాక్సిడెంట్​.. సంక్రాంతి పండుగకు వచ్చి, తిరిగి వెళ్తుంటే..

చిన్నగొట్టిగల్లు, (ప్రభ న్యూస్): తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భాకరాపేట ఘాట్ లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. భాకరాపేట ఎస్సై ప్రకాష్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం.. తిరుపతి జిల్లా సత్యనారాయణపురానికి చెందిన సాయికృష్ణ( 22), అతని స్నేహితులు హేమంత్ (20), హైదరాబాద్ ప్రశాంత్ నగర్ కు చెందిన శివకుమార్(20).. ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనం (AP39RL1232)పై పీలేరు నూతన కాలం నుండి తిరుపతికి వస్తున్నారు. ఈ క్రమంలో వారి బైక్​ని ఆర్​టీసీ బస్ (AP03z0067)ను ఢీకొట్టింది. దీంతో ఘాట్ రోడ్డు మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. సాయి కృష్ణ, హేమంత్ అక్కడికక్కడే మరణించారు.

ఈ సమాచారం అందుకున్న ఎస్​ఐ ప్రకాష్ కుమార్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వీరిలో శివకృష్ణకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో అతడిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా శివకృష్ణ హైదరాబాద్ ప్రశాంత్ నగర్ నుంచి తన సొంతూరైన నూతన కాలువకు వచ్చి తిరుపతికి వెళ్తుండగా ఈ యాక్సిడెంట్​ జరగడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement