Friday, March 29, 2024

పిల్ల‌ల‌తో క‌లిసి బావిలో దూకేసిన తల్లి.. అది యాక్సిడెంటల్‌గా జ‌రిగిందంటున్న పోలీసులు

కర్నూలు: కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా శనివారం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కర్నూలు మండలం పూలతోట గ్రామంలో చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో ఐదేళ్ల లోపు పిల్లలు సుచరిత, పునీత్‌రెడ్డి ఇద్దరూ అక్కడికక్కడే చ‌నిపోయారు. తల్లి మౌనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అయితే.. ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని పోలీసులు తెలిపారు.

తల్లి బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు పిల్లలిద్దరూ బావిలోకి జారిపోయారని కర్నూలు తాలూకా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కంబగిరి రాముడు తెలిపారు. ఆమె వారిని రక్షించేందుకు ప్రయత్నించింది. ఈ ఆకస్మిక ఘటనలో ఆమె కూడా బావిలో పడగ స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement