Friday, March 29, 2024

Breaking: రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి మృతి

కర్నూలు మండలం, మామిదాలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి దుర్మరణం చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే… విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన కర్నూలు బుధవారం పేటకు చెందిన జస్వంత్ (24) తన సొంత పనిపై మిత్రుడు వసంతుతో కలిసి కర్నూల్ మండల పరిధిలోని మునగాలపాడుకు వెళ్లి తిరిగి వస్తుండగా మామిడాల పడు వద్ద బైక్ అదుపు తప్పి జస్వంత్ కింద పడ్డాడు.. దీంతో తలకు గాయమై జస్వంత్ అక్కడికక్కడే మరణించగా, మిత్రుడు వసంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement