Saturday, April 20, 2024

Breaking: మైలవరంలో తెరపైకి లోకల్ పంచాయితీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మరోసారి లోకల్ పంచాయితీ తెరపైకి వచ్చింది. అన్ని పార్టీలు స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. మన మైలవరం – మన నాయకత్వం పేరుతో మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు బ్రోచర్లు రిలీజ్ చేశారు. మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ ఛార్జ్ ఇద్దరూ పక్క నియోజకవర్గం వాళ్లేనంటూ రమేష్ విమర్శించారు. డెవలప్ మెంట్ కంటే స్వప్రయోజనాల కోసమే మైలవరంలో వలస నేతలు పోటీ చేస్తున్నారని రమేష్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో స్థానికులనే గెలిపించుకోవాలని ప్రజల్లోకి వెళ్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement