నెల్లూరు జిల్లాలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని తండ్రి ఆస్పత్రి నుంచి బైక్పై స్వగ్రామానికి తీసుకెళ్లాడు. మృతదేహం తరలించలేమన్న 108 వాహన సిబ్బంది నిరాకరించడంతో తండ్రి అవస్థలు పడ్డాడు. నాయుడుపేట నుంచి మృతదేహం తీసుకెళ్లేందుకు ఆటోల నిరాకరించారు. ప్రైవేటు అంబులెన్స్కు డబ్బుల్లేక బైక్పైనే మృతదేహం తీసుకెళ్లాడు.
దొరవారిసత్రం మండలం కొత్తపల్లి చెందిన బాధితుడి కూతురు అక్షయ(2) నిన్న గ్రావెల్ గుంతలో ప్రమాదవశాత్తు పడింది. గ్రావెల్ గుంటలో పడి అన్న, చెల్లెలు నీటమునిగారు. అయితే, గ్రావెల్ గుంతలో పడిన శ్రవంత్ను గొర్రెల కాపరి కాపాడారు. అయితే, అక్షయ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. నాయుడుపేట ఆస్పత్రికి తరలించేలోగా చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి మృతదేహాన్ని తిరిగి స్వగ్రామం తరలించేందుకు 108 వాహన సిబ్బంది నిరాకరించడంతో తండ్రి అవస్థలు పడ్డాడు.