Saturday, April 20, 2024

అచ్చెన్నాయుడిపై కేసు నమోదు..

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై కేసు నమోదైంది. టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం నేపథ్యంలో ఏర్పాటు చేసిన కుప్పం బహిరంగ సభలో అచ్చెన్నాయుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఎస్సై శివకుమార్ చేసిన ఫిర్యాదు మేరకు అచ్చెన్నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement