Friday, March 29, 2024

కడపలో రెడ్ స్మగ్లింగ్.. 9 మంది అరెస్ట్

కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కడప ఎస్పీ అన్బురాజన్ ఆధ్వరంలో పోలీసుల బృందం తనిఖీలు చేపట్టారు. అక్రమంగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్న తొమ్మిది మంది నిందితులను పట్టుకున్నారు. వారి దగ్గరి నుంచి 55 ఎర్రచందనం దుంగలు, కారు ,5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితులకు గతంలో కూడా నేర చరిత్ర ఉందని ఎస్పీ అన్బురాజన్   తెలిపారు. ఎవరైనా ఎర్రచందనం స్మగ్లింగ్‌కి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వారిపై పీడీయాక్ట్‌లు పెడతామని, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వారిపై నిఘా పెంచామని కడప ఎస్పీ అన్బురాజన్  వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement