Friday, March 29, 2024

Murder case: ఒక హత్య.. నలుగురు నిందితులు

చిత్తూరు జిల్లా నాగలాపురం ద్వారకా నగర్ లో జరిగిన వివాహిత హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 23న శాంతి అనే వివాహిత హత్యకు గురైంది. ఈ కేసులో భర్త సురేష్ (37) , అత్త లక్ష్మీ, రాజశేఖర్(29), సుకుమార్ ( 22) ను‌ నిందితులుగా పట్టుకున్నారు. భార్య శాంతి వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం, అదనపు కట్నం తేలేదనే కారణంతోనే భర్త సురేష్… అతని స్నేహితులు రాజశేఖర్ ,సుకుమార్ లతో కలిసి అత్త లక్ష్మీ సహకారంతో హత్యకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు. హత్యకు ఉపయోగించిన మచ్చుకత్తి , ఫోన్ , బైక్ ను నిందితుల వద్ధ నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement