Thursday, April 25, 2024

ఏపీ శాసనమండలిలో కొత్తగా నలుగురు ఎమ్మెల్సీలు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో కొత్తగా నలుగురు ఎమ్మెల్సీలు అయ్యారు. ప్రభుత్వం ఇటీవల గవర్నర్ కోటాలో త్రిమూర్తులు (తూర్పుగోదావరి), రమేశ్ యాదవ్ (కడప), లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), మోషేన్ రాజు (పశ్చిమ గోదావరి)ల పేర్లను గవర్నర్ కు సిఫారసు చేసింది. ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. దీంతో ఎన్నికల సంఘం నామినేటెడ్ ఎమ్మెల్సీల ఉత్తర్వులు జారీ చేసింది. తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, రమేశ్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డిలను ఎమ్మెల్సీలుగా ఈసీ ప్రకటించింది. కాగా, ఇటీవల ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యుల పదవీకాలం ముగియడంతో 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement