Thursday, April 25, 2024

Road Accident : ఆటో-బైక్ ఢీ.. నలుగురికి గాయాలు

చిత్తూరు జిల్లా చేరవి మండలంలోని హీరో పరిశ్రమ వద్ధ ఆటో-బైక్ ఎదురెదురుగా ఢీ కొనడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని ఓబుల్ రాజు కండ్రిగకు చెందిన మునేంద్ర ఆటోలో మహిళా పారిశుధ్య కార్మికులను హీరో పరిశ్రమలో వదిలిపెట్టి వస్తుండగా.. గొల్లవారిపాలెంకు చెందిన సతీష్ అనే యువకుడు అమ్మ సుజాత, పెద్దమ్మ సుగంధిని ద్విచక్ర వాహనంపై కికువా పరిశ్రమకు తీసుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో హీరో పరిశ్రమ గేట్ వద్ధ ఆటో ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సత్యవేడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement