Friday, April 19, 2024

గుంటూరు జీజీహెచ్ లో కిడ్నాప్ కలకలం

గుంటూరులోని జీజీహెచ్లో 4 రోజుల వయసున్న ఓ శిశువు మిస్సింగ్ కావడం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా పెద కాకానికి చెందిన ప్రియాంక అనే మహిళ ఈ నెల 13న జీజీహెచ్ లో బాబుకు జన్మనిచ్చింది. బాలింతను, శిశును చూసుకోవడం కోసం… అమ్మమ్మ, నానమ్మ ఇద్దరూ ఆస్పత్రిలోనే ఉన్నారు. శుక్రవారం రాత్రి సమయంలో పసికందు ఏడుస్తుండటంతో నాన్నమ్మ బాబును బయటకు తీసుకొచ్చింది. తర్వాత బాత్రూమ్‌కు వెళ్తూ.. అమ్మమ్మ పక్కన ఉంచి వెళ్లింది. దు నిమిషాల్లోనే తిరిగి వచ్చే సరికి శిశువును అపహరణకు గురయ్యాడు. దీంతో ఆందోళన చెందిన బాధితులు.. కొత్త పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: కర్రలు లేచాయి.. తలలు పగిలాయి.. బన్నీ ఉత్సవం రక్తసిక్తం

Advertisement

తాజా వార్తలు

Advertisement