Friday, April 19, 2024

గ్యాస్ ప్రమాదంలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేకుంది. గ్యాస్ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున సమయంలో ఇంట్లో వంట చేస్తుండగా రెగ్యులేటర్ పైపు కట్ అయి మహిళకు మంటలు అంటుకోగా మంట ఆర్పే ప్రయత్నంలో భర్తకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో సంఘటన స్థలంలోనే దంపతులు మృతి చెందగా.. వారితో పాటు వున్న 13 ఏళ్ళ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక కూడా మృతి చెందింది. దీంతో ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు వారి కుటుంబంలో విషాదం నెలకొంది. మృతులు సయ్యద్ అబ్బాస్ (42), సయ్యద్ నౌషాద్ (38), సయ్యద్ అయేషా (13)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement