Thursday, April 25, 2024

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బైకులు ఢీకొని ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లాలోని వి.కోటకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ సినిమా హీరో అభిమానులు మృతి చెందారు. నేడు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల సందర్భంగా వికోటలో భారీ కటౌట్లు కట్టి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement