Friday, March 29, 2024

అనంతపురంలో విషాదం.. చెరువులో మునిగి చిన్నారులు మృతి

అనంతపురం జిల్లా అమడగూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మలకవారిపల్లి ఎగువ తండా చెరువులో పడి గల్లంతైన ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. ఎగువ తండాకు చెందిన ఇద్దరు మహిళలు సోమవారం దుస్తులు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లారు. వారితోపాటు వచ్చిన ముగ్గురు పిల్లలు చెరువులో ఆడుకుంటూ లోతుకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో వారు గల్లంతయ్యారు. నిన్నటి నుంచి చెరువులో గాలించగా…ఈ రోజు తెల్లవారుజామున ముగ్గురు మృతదేహాలు నీటిపైకి తేలాయి. చిన్నారులు లాలూప్రసాద్‌, పురుషోత్తం, హేమంత్‌ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇది కూడా చదవండి: ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement