Thursday, April 25, 2024

చెరువు సమీపంలో బస్సు బోల్తా.. 23 మంది ప్రయాణికులు..

ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పొన్నలూరు గ్రామ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 23 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కందుకూరు నుంచి కనిగిరికి ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. పొన్నలూరు చెరువు సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న టాటా ఏసీ వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి చెరువు పక్కన బోల్తా పడింది. అయితే, ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement