Thursday, April 18, 2024

202మందిని నుంచి తొల‌గించారు.. చంద్ర‌బాబును క‌లిసిన గ్రూప్ -1 అభ్య‌ర్థులు

2018 గ్రూప్ – 1 నోటిఫికేషన్ ఇంటర్వ్యూ జాబితా నుంచి తమను తొలగించారని, తమకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థులు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి కోరారు. డిజిటల్ మూల్యాంకనంకు, సాధారణ మూల్యాంకనంకు ఫలితాల్లో భారీ తేడా ఉందని చెప్పారు. మూల్యాంకనంలో జరిగిన అవకతవకల కారణంగా 202 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ జాబితా నుంచి తొలగించబడ్డారని చంద్రబాబుకు వివరించారు. సాధారణ మూల్యాంకనం పేరుతో APPSC పెద్దలు అక్రమాలకు పాల్పడ్డారని, తమకు న్యాయం జరిగేలా చూడాలని చంద్రబాబుకు విన్నవించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement