Thursday, April 25, 2024

ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. మొత్తం 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనారిటీ సంక్షేమ స్పెషల్ సెక్రెటరీగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ ను కృష్ణా జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా ఎల్ఎస్ బాలాజీరావును నియమించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గా నాగలక్ష్మిని నియమించారు. ఇప్పటివరకు అనంతపురం జిల్లా కలెక్టర్ గా వ్యవహరించిన గంధం చంద్రుడును గ్రామ, వార్డు సచివాలయాల విభాగం డైరెక్టర్ గా నియమించారు. పాడేరు ఐటీడీవో పీవోగా గోపాలకృష్ణ రోణంకిని నియమించారు.

ప్రకాశం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా కేఎస్ విశ్వనాథన్, కడప జిల్లా జేసీగా ధ్యానచంద్ర, తూర్పుగోదావరి జిల్లా జేసీగా జాహ్నవి, కర్నూలు జిల్లా జేసీగా ఎన్.మౌర్య, కృష్ణా జిల్లా జేసీగా నుపుర్ అజయ్ కుమార్, గుంటూరు జిల్లా జేసీగా అనుపమ అంజలి, నెల్లూరు జిల్లా జేసీ విదేహ కరే, చిత్తూరు జిల్లా జేసీగా ఎస్.వెంకటేశ్వర్, పశ్చిమ గోదావరి జిల్లా జేసీగా జీఎస్ ధనుంజయ్, విశాఖ జిల్లా జేసీగా కల్పనా కుమారి, విజయనగరం జిల్లా జేసీగా మయూర్ అశోక్, శ్రీకాకుళం జిల్లా జేసీగా హిమాన్షు కౌశిక్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement