Friday, March 29, 2024

అనంతలో చిన్నారి మిస్సింగ్… తండ్రిపైనే అనుమానం

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామంలో చిన్నారితో క‌లిసి ఓ తండ్రి క‌నిపించ‌కుండా పోయాడు. గ్రామానికి చెందిన మల్లికార్జున చిట్టెమ్మలకు రెండు నెలల చిన్నారి ఉంది. ఈరోజు ఆ చిన్నారిని హాస్పిటల్ కు దంపతులు తీసుకొచ్చారు. భార్యను హాస్పిట‌ల్ దగ్గర ఉండమని చెప్పి పాప‌ను తీసుకొని మ‌ల్లికార్జున వెళ్లాడు. నాలుగు గంటలైన త‌ను రాకపోవడంతో అనుమానం వచ్చిన చిట్టెమ్మ‌ పోలీస్ లకు కంప్లేంట్‌ చేసింది.

గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన పోలీస్ లు ఐదుకల్లు గ్రామానికి వెళ్లే వెత‌క‌డం మొదలు పెట్టారు. ఆ చిన్నారిని తీసుకెళ్లిన‌ప్పుడు ఉన్న టవల్ తదితర వస్తువులు పక్కనే ఉన్న చెరువు దగ్గర క‌నిపించాయి. దీంతో ఆ చిన్నారిని మ‌ల్లికార్జున చంపి ఉంటాడ‌న్న అనుమానం వ్య‌క్తం అవుతోంది. దీంతో మ‌రింత సెర్చ్ చేస్తున్నారు పోలీలుసులు. దీనిపై ఇంకా పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Huzurabad Bypoll: ఆ పార్టీలకు ఈసీ షాక్

Advertisement

తాజా వార్తలు

Advertisement