Saturday, April 20, 2024

Flash: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు దుర్మరణం

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ -కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. మృతులు రాజనాల మురళీకృష్ణ, ఊర్మిళదేవిగా గుర్తించారు. ప్రమాదంలో మరో మహిళకు తీవ్ర గాయాలు కాగా.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. విశాఖపట్నం నుంచి బుట్టాయగూడెం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement