Thursday, March 28, 2024

జవాద్ ఎఫెక్ట్: కొబ్బరిచెట్టు విరిగి పడి బాలిక మృతి

ఉత్తరాంధ్రలో జవాద్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ తీవ్రతతో వీస్తున్న గాలులకు వజ్రపుకొత్తూరు మండలం గోపినాధపురం గ్రామంలో కొబ్బరిచెట్టు విరిగిపడి ఓ బాలిక(16) మృతి చెందింది. గోరకల ఇందు (16) మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement