Thursday, April 25, 2024

ఆ చేప ధర లక్ష రూపాయలు.. చేప ప్రత్యేకత ఏంటి?

సాధారణంగా కిలో చేప ధర రూ. 180 నుంచి 220 వరకు ఉంటుంది. అధికర బరువు ఉంటే దాని రేటు మహా అయితే రూ.500 వరకు ఉంటుంది. కానీ ఓ చేప మాత్రం అక్షరాల లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. తూర్పుగోదావరి జిల్లాలో ఓ మత్స్యకారుడి వలకు అరుదైన చేప చిక్కింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీఫిషింగ్‌ హార్బర్‌‌కు కచిడీ చేపను తీసుకొచ్చారు. ఆ చేపను తూకం వేస్తే ఏకంగా 16కిలోల ఉంది. దానిని ఓ వ్యాపారి రూ.లక్షకు కొనుగోలు చేశారని మత్స్యకారులు తెలిపారు. ఈ చేప పొట్ట భాగాన్ని మందుల తయారీలో ఉపయోగిస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఈ చేప విలువలో 98 శాతం పొట్ట భాగమే విలువ ఉంటుందని.. ఈచేపను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తామని వ్యాపారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement