Thursday, April 25, 2024

సైబ‌ర్ మోసంతో 15ల‌క్ష‌లు న‌ష్ట‌పోయా.. నీ పెళ్లంతో లంచ్ పెట్టించు అంటున్న డీఎస్పీ

పోలీసులు అంటే ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తార‌న్న న‌మ్మ‌కం కుద‌ర‌డం లేదు. చాలామటుకు పోలీసుల్లో మంచి వారున్నా.. ఎక్క‌డో ఓ చోట జరిగే ఇట్లాంటి విష‌యాలు జ‌నాల‌ను మ‌ళ్లీ భ‌యంలోకి నెడుతున్నాయి. మొత్తం పోలీసు వ్య‌వ‌స్థ‌కే చెడ్డ‌పేరు తెచ్చి న‌మ్మ‌కం కోల్పోయేలా చేస్తున్నారు కొంత‌మంది. ఇట్లాంటి ఘ‌ట‌నే అనంత‌పురం జిల్లాలో జ‌రిగింది. అక్క‌డి డీఎస్పీ బాధితుడిని త‌న పెళ్లాంతో లంచ్ పెట్టిస్తే కేసు ప‌రిష్క‌రిస్తాన‌న్న మాట‌లు మొత్తం వ్య‌వ‌స్థ‌కే మాయ‌ని మచ్చ‌గా మిగిలాయి..

– డిజిట‌ల్ మీడియా, ఆంధ్ర‌ప్ర‌భ‌

సైబర్ ఉచ్చులో చిక్కుకుని మోసపోయిన ఓ ఆర్ఎంపీ పోలీసులను ఆశ్రయించాడు. అయితే.. పోలీసులు ఆ డ‌బ్బులు రావు, తామేమీ చేయ‌లేమ‌ని చెప్ప‌డంతో ఆందోళ‌న గుర‌య్యాడు. పోలీసుల తీరుతో మనస్తాపం చెందిన ఆయన ఎస్పీకి లేఖ రాసి అదృశ్యమయ్యాడు. ఇది అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కొండాపురానికి చెందిన ఆర్ఎంపీ జి.వెంకటేశ్‌‌కు చెందిన ఘ‌ట‌న‌. లక్కీ డ్రా పేరుతో వల విసిరిన సైబర్ నేరగాళ్లు అతడి నుంచి రూ. 15 లక్షలు కాజేశారు.

చివరికి మోసపోయానని గ్రహించిన వెంకటేశ్ పోలీసులను ఆశ్రయించారు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఈ నెల 19న ‘స్పందన’ కార్యక్రమలో ఎస్పీకి తన బాధ చెప్పుకున్నాడు. న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఆయన ఆదేశాలతో పుట్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఈ నెల 22న తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఎదుట వెంకటేశ్ హాజరయ్యాడు.

ఆ తర్వాత ఎస్పీకి వెంకటేశ్ లేఖ రాస్తూ.. డీఎస్పీ తనను అవమానించారని ఆరోపించాడు. తన గురువైన మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌ను కూడా డీఎస్పీ కించపరిచాడ‌ని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు, పోయిన డబ్బులు తిరిగి రావని, పోయి అడుక్కుతిన‌డ‌మే మంచిద‌ని తిట్టారని పేర్కొన్నాడు. డీఎస్పీ తన ఇంటికి వస్తానని, తన భార్యతో కలిసి భోజనం చేద్దామని అన్నారని ఆ లేఖలో పేర్కొన్నాడు. తన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరిన ఆయన ఆ తర్వాత క‌నిపించ‌కుండా పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో వెంకటేశ్‌ను వెతికేందుకు రంగంలోకి దిగిన పోలీసులు అతను హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు.

- Advertisement -

మరోవైపు, వెంకటేశ్‌ను మోసం చేసిన సైబర్ నేరగాడు కోల్‌కతాలో ఉన్నట్టు తెలుసుకుని పోలీసులు నిన్న కోల్‌కతా వెళ్లారు. రూ. 2.50 లక్షల వరకు రికవరీ చేసి బాధిత కుటుంబానికి అందించామని, నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం మిగతా సొమ్మును కూడా రికవరీ చేసి బాధిత కుటుంబానికి అందజేస్తామని పుట్లూరు ఎస్సై గురుప్రసాద్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement