Friday, March 29, 2024

Flash: శానిటైజర్ తాగి విద్యార్థిని మృతి

కడప జిల్లా సంబేపల్లి మండల పరిధిలోని నారాయణ రెడ్డి గారి పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.  ఎర్రగుంట్ల సమీపంలోని జి.ఎం.సి.బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థిని రెడ్డి అమృత శానిటైజర్ తాగి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే రాయచోటి అబ్బవరం గ్రామం పొదలపల్లికి చెందిన రెడ్డి అమృత బాలయోగి గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బుధవారం శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన విద్యార్ధినిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement