Friday, March 29, 2024

హెటిరో సొమ్మంతా జగన్ దే: అయ్యన్న సంచలన ఆరోపణ

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. హెటిరోలో దొరికిన సొమ్మంతా సీఎం  జగన్ దేనని ఆరపించారు. రూ.147 కోట్లు కాదని ఇంకా వేల కోట్లలో దాచారని పేర్కొన్నారు. ఇదంతా అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లలో దోచిందేనని అయ్యన్న ఆరోపించారు. విశాఖలో వివిధ కార్యాలయాలను రూ. 25 వేల కోట్లకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. జైల్లో చిప్ప కూడు తిన్నవారికి పాలనపై అవగాహన ఏం ఉంటుందని విమర్శించారు. ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారని అయ్యన్న మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: మంత్రి కన్నబాబును అడ్డుకున్న వైసీపీ నేతలు

Advertisement

తాజా వార్తలు

Advertisement