Thursday, April 25, 2024

హిందూపురం బంద్​లో అపశృతి.. ఒంటిపై పెట్రోలు పోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం

అనంతపురం: హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని.. హిందూపురం సంబంధిన రాజకీయ పార్టీల నాయకులు శనివారం పట్టణ బందుకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ర్యాలీ నిర్వ‌హిస్తున్నారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ అంబేద్కర్ సర్కిల్లో నవీన్ అనే యువకుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య య‌త్నానికి పాల్ప‌డ్డాడు.

దీన్ని గుర్తించి అతనిపై నీరు పోసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు లోక‌ల్ లీడ‌ర్లు, స్థానికులు. దీంతో ప్రశాంతంగా జరుగుతున్న బందులో అపశృతి చోటు చేసుకుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి హిందూపురం కేంద్రంగా శ్రీ సత్య సాయి పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని రాజకీయాలను పక్కన పెట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి లోక్ స‌భ‌ పరిధిని జిల్లా కేంద్రంగా ప్రకటించినట్లు హిందూపురంను కూడా ప్రకటించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement