Monday, March 25, 2024

సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం కె విశ్వనాథ్ – జగన్

అమరావతి -. కళా తపస్వి కె విశ్వనాథ్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో తీవ్రసంతాపం తెలిపారు. విశ్వనాథ్‌గారి మరణం తీవ్ర విచారానికి గురిచేసింది.తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌గారు.ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. దివంగత వైఎస్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును కళా తపస్వి కె.విశ్వనాథ్ కి అందించిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement