Thursday, March 28, 2024

విశాఖలో కుప్పకూలిన భవనం…. ముగ్గురి దుర్మరణం

విశాఖ నగరం కలెక్టరేట్‌ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది.. పురాతన మూడు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో విషాదఛాయలు అలముకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న మూడు మృతదేహాలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండు మృతదేహాలను బయటకు తీశాయి.

ఈ ప్రమాదంలో శిథిలాల కింద పడి బాలిక సాకేటి అంజలి(14), ఆమె సోదరుడు దుర్గాప్రసాద్‌(17) మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. తాజాగా మరో వ్యక్తి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది గురువారం ఉదయం వెలికితీశారు. మృతుడు బిహార్‌కు చెందిన చోటు (27)గా అధికారులు గుర్తించారు. గాయపడిన వారిలో కొమ్మిశెట్టి శివశంకర, సాకేటి రామారావు, సాకేటి కల్యాణి, సున్నపు కృష్ణ, సాతిక రోజారాణి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement