Thursday, April 25, 2024

మరో రెండు రోజులు భారీ వర్షాలు

ఏపీలో వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో… వచ్చే రెండు రోజులు ఏపీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 6 జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులెవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీలో వచ్చే రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడొచ్చంటోంది… వాతావరణ శాఖ. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని… మత్స్యకారులు వేటకు వెళ్లడాన్ని నిషేధించామని అధికారులు తెలిపారు. తహసీల్దార్లు, ప్రభుత్వ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని… విశాఖ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. విశాఖలో 5, కళింగపట్నంలో 4, తునిలో 3. నరసాపురం, విజయవాడల్లో రెండేసి సెంటీమీటర్ల మేర్థం పడింది. భారీ వర్షాలకు సీలేరు కాంప్లెక్స్‌లో వరద ప్రవాహం పెరుగుతోంది. డొంకరాయి జలాశయం నుంచి 6,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

ఇది కూడా చదవండి: బీజేపీని నమ్ముకొని ఈటల మోసపోయారు: మధుయాష్కీ

Advertisement

తాజా వార్తలు

Advertisement